by సూర్య | Fri, Jan 27, 2023, 02:12 PM
కుప్పంలో యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పెనమలూరు నుంచి తరలివెళ్లారు. బోడె దళం యాత్రను పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా ఊపి ప్రారంభించారు. కొల్లిపర ప్రమోద్, తాతినేని సుధీర్, లింగమనేని గోకుల్, బోడె సురేంద్ర, మండవ భార్గవ్, గూడూరు బాలయ్య, తాడికొండ అజయ్, జమ్ముల గోపి కిరణ్, కంఠంనేని పార్థు ఉన్నారు.
Latest News