by సూర్య | Fri, Jan 27, 2023, 02:07 PM
సకల శాఖా మంత్రినంటూ తనపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అని తాము స్పష్టంగా చెప్పగలమన్నారు. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబో.. పవనో.. లోకేశో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని వచ్చినా విడివిడిగా వచ్చినా వైసీపీ పట్టించుకోదని సజ్జల అన్నారు. కాగా, ఉగాది తర్వాత విశాఖ నుంచే ప్రభుత్వ పాలన సాగుతుందని సజ్జల తెలిపారు.
Latest News