వైసీపీ సినిమా ఇపోనట్లేనా...? ఐప్యాక్‌ సర్వే

by సూర్య | Fri, Jan 27, 2023, 02:06 PM

రాష్ట్ర మంత్రివర్గంలో 25 మంది! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... అందులో 20 మంది మంత్రులు ఓడిపోతారు! ఐదుగురు మాత్రమే తిరిగి గెలుస్తారు! 13 మంది మాజీల్లో గెలుపు అవకాశం ఉన్నది ఇద్దరికే!! అధికార పార్టీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ‘ఐప్యాక్‌’ చేసిన సర్వేలో తేలిన ఫలితమిది! దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. మంత్రులే 20 మంది ఓడిపోతే... ఎమ్మెల్యేల మాటేమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్‌ను నియమించుకొన్న విషయం తెలిసిందే. ఆ సంస్థ క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. తాజాగా... జనవరి నెలలో వెల్లడైన సర్వే ఫలితాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. మొత్తం ఎమ్మెల్యేల లెక్క కాకుండా... మంత్రులకు సంబంధించిన ఫలితాల వీడియో క్లిప్‌ మాత్రమే బయటికి వచ్చింది. ఈ సర్వే వివరాల పత్రాలపై ఐ ప్యాక్‌ సంస్థ వాటర్‌ మార్క్‌ కూడా ఉండటంతో... అవి నిజమైనవే అని భావిస్తున్నారు. ఈ వివరాల ప్రకారం... జగన్‌ మంత్రివర్గ సహచరుల్లో ఐదుగురు మాత్రమే మళ్లీ ఎన్నికల్లో నెగ్గే అవకాశముంది. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM