by సూర్య | Fri, Jan 27, 2023, 01:59 PM
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలను విడుదల చేశామని జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రకారం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేశామని చెప్పారు. వరపుల వెంకట రమణ (ఏలేశ్వరం),బి.అన్నవరం(కాకినాడ), దుళ్ళ విజయ్ (రాజమహేంద్రవరం, తాడితోట), నంద శ్రీను(నామవరం)లను విడుదల చేసినట్టు తెలిపారు.
Latest News