ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

by సూర్య | Fri, Jan 27, 2023, 01:51 PM

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, ఇది పోవాలంటే సైకిల్‌ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా, ఆలూరు మండలంలోని పి. కోటకొండ గ్రామంలో జరిగిన మారెమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారిని ఎడ్లబండ్లపై ఎక్కించి పూలవర్షం కురిపిస్తూ ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.....  నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కేవలం వైసీపీ కార్యకర్తలకు పథకాలను అందిస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారం కోల్పోతుందా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం పాదయాత్ర ప్రారంభించనున్నందున వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ న్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌గౌడ్‌, మండల టీడీపీ నాయకులు బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, మాలిక్‌, వెంకటస్వామిగౌడ్‌, పరమేష్‌గౌడ్‌, సుభాన్‌, బండ్లయ్య, రాజాసాహెబ్‌, మల్లికార్జునగౌడ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM