పాపిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం

by సూర్య | Fri, Jan 27, 2023, 01:47 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డి పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు లారీలు కూడా రోడ్డు పక్కనే ఉన్న చెరువు తూములోకి పడ్డాయి. ఇంత విషయం తెలుసుకున్న సొమ్మందేపల్లి ఏఎస్ఐ మురళి సిబ్బందితో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని ఆసుపత్రికి తరలించారు. లారీలో ఇరుక్కున్న మరొక్కరిని బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM