by సూర్య | Fri, Jan 27, 2023, 01:46 PM
నేటి మధ్యాహ్నం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో అపాయింట్మెంట్స్ను బట్టి ఆయన పర్యటన ఉండే అవకాశం ఉందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల నేపథ్యంలో సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. తాజా పరిణామాలతో ముందుగానే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ నేడు జరగాల్సిన హైదరాబాద్, గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనను రద్దు చేసుకున్నారు.
Latest News