రాంకో సిమెంట్ గార్డులు, గిరిజన మహిళపై దాడి

by సూర్య | Fri, Jan 27, 2023, 01:46 PM

ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనులు ధర్నాకు దిగారు. స్థానిక గిరిజన మహిళలు కట్టెపుల్లలు ఏరుకునేందుకు వెళ్లగా అక్కడి గార్డులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గార్డుల వైఖరికి నిరసనగా ధర్మారపాడు తండా గ్రామానికి చెందిన గిరిజనులు సిమెంట్ కంపెనీ మెయిన్ గేట్ ముందు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గార్డుల దాడిలో క్షతగాత్రులైన మహిళను జగ్జయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM