బడా నేతల ఆధ్వర్యంలో నకిలీ కరెన్సీ , అక్రమ మద్యం

by సూర్య | Fri, Jan 27, 2023, 01:41 PM

అధికారం ఉన్నప్పుడే అడ్డదిడ్డంగా సంపాదించుకోవాలన్నది నేతలకు అలవాటుగా మారింది. వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలో వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రసపుత్ర రజని నకిలీ నోట్లు చెలామణి చేస్తూ బెంగళూరులో పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఆమె వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు రూ.44 లక్షల విలువచేసే రూ.500ల నకిలీ నోట్లు బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం సద్దుమణగకముందే కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠానికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ నిత్య శివరాం బెంగళూరు నుంచి అక్రమ మద్యాన్ని బి.మఠానికి తరలిస్తూ ఖాజీపేట వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు చిక్కారు. శివరాం ఆయన సతీమణితో కలిసి వాహనంలో వెళుతుండగా బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.25 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్ల బాక్సులు పట్టుబడ్డాయి. ఈ ఘటన వైసీపీలో తీవ్ర కలకలం రేపింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM