ఎన్నికల యాత్రలు మొదలయ్యేరా...ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు

by సూర్య | Wed, Jan 25, 2023, 11:45 PM

ఏపీలో ఎన్నికల యాత్రలు ప్రారంభంకానున్నాయి. అన్ని ప్రధాన పార్టీల నేతలు  ఈ యాత్రలకు సిద్దమవుతన్నారు. ఇదిలావుంటే  'వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ఎస్టాబ్లిష్‌డ్ లీడర్లు. 1400 కిలోమీటర్లు వైఎస్సార్ తిరిగారు. ఆయన్ను ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ నేతలు కూడా విబేధాలు పక్కనబెట్టి వైఎస్సార్‌తో నడిచారు. అప్పుడే అధికారంలోకి రావడం సాధ్యమైంది. ఆ తర్వాత చంద్రబాబు తిరిగారు. 2014లో చంద్రబాబుకు ఏపీలో అధికారం సాధ్యమైంది. అలా ఏపీలో పాదయాత్ర చేసిన ప్రతీ ఒక్కరు అధికారంలోకి వచ్చారు. ఏపీలో లోకేష్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారు. దీనివల్ల పార్టీని యాక్టివేట్ చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు'. అని సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు వ్యాఖ్యానించారు.


'ఈ సమయంలో.. అధికార వైఎస్సార్సీపీ కూడా ప్రతిగా కార్యక్రమాలు చేస్తోంది. గతంలో చంద్రబాబు పర్యటన సమయంలో కూడా మనం చూశాం. జగన్ ఒక్కడే నాయకుడైనా.. ప్రతీ ఎమ్మెల్యేను ఇంటింటికీ తిప్పుతున్నారు. ఆయన తిరగడం లేదు. గత ఎన్నికల్లో జగన్‌ను ఎంత దూషించినా.. అది ఆయనకు ప్లస్ అయ్యింది. ఇప్పుడు కూడా అందరు కలిసి జగన్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. ప్రజలు కూడా వాటిని వినీవినీ ఉన్నారు. అయినా.. 2024లో జగన్‌కు కొంత ఇబ్బంది తప్పదు. 175 స్థానాల్లో విజయం సాధించడం అంత తేలిక కాదు' అని సీహెచ్‌వీఎం కృష్ణారావు స్పష్టం చేశారు.


'ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి వాతావరణం మారిపోతోంది. గతంలో జగన్ అధికారంలోకి వస్తారని ముందే అందరికీ తెలిసింది. అందుకే అధికారులు కూడా జగన్ వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర గురించి ప్రజలు ఆలోచిస్తారు. జగన్‌కు ప్రజా సమస్యల గురించి అవగాహన లేదు. 2019 ఎన్నికలకు, 2024 ఎన్నికలకు చాలా తేడా ఉంది. అప్పుడు వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి జగన్ రాజకీయంగా లాభపడ్డారు. వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే పవన్ యాత్ర చేస్తున్నారు' అని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.


'జగన్‌ను తట్టుకోలేక వారు యాత్రల పేరుతో వస్తున్నారు. ఓవైపు లోకేష్‌ను.. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు సెట్ చేసుకున్నారు. వీరి యాత్రలతో ఏమీ ఒరగదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. అప్పుడు వేరుగా పోటీ చేశారు. ఇప్పుడు ఎందు కలిసి పోటీ చేస్తున్నారు. వీళ్లందరికీ జగన్‌ను గద్దె దించాలనే యావ తప్ప ఏమీ లేదు. కేవలం అధికార దాహంతో వీరు పనిచేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం ఉద్యమాలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా బతికి ఉందంటే దానికి కారణం.. వైఎస్సార్సీపీనే' అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు.


'జగన్ వచ్చిన 3 నెలల తర్వాత మేము ఉద్యమం ప్రారంభించాం. ఇక్కడే కాదు.. ఢిల్లీలోనూ ఉద్యమాలు చేస్తున్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం. దీంట్లో అందరూ పాల్గొనవచ్చు. వైఎస్సార్సీపీ వారు వచ్చినా కూడా కలుపుకొని వెళ్తాం. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ పాల్గొంటున్నారు. మేము పదవుల కోసం ఉద్యమాలు చేయడం లేదు. అందరం కలిసి రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలనే మేము కోరుతున్నాం. రాష్ట్రాభివృద్ధి వ్యతిరేకులు మినహా.. వేరే ఎవ్వరూ మమ్మల్ని వ్యతిరేకించరు. గతంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన మాకు మద్దతు పలికారు. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు చేస్తున్నాం. మీము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు .పవన్, లోకేష్ పాదయాత్రలో కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రస్తావించాలి' అని ఆంధ్రా మేధావుల సంఘం ప్రతినిధి చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.


Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM