సీఎం జగన్ ను కలిసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబం

by సూర్య | Wed, Jan 25, 2023, 11:07 PM

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి  కుటుంబం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరివెన్నెల భార్య పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సి.ఎస్. శాస్త్రి  సీఎంతో కలిసి కాసేపు ముచ్చటించారు. సిరివెన్నెలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జగన్ సాయం చేశారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని జగన్ ప్రభుత్వమే భరించింది. తమ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

 
ఎన్నికల కోడ్ ఉన్నట్టా.. లేనట్టా? Wed, Apr 24, 2024, 01:23 PM
60 లీటర్ల నాటు సారా పట్టివేత Wed, Apr 24, 2024, 01:19 PM
ఒంగోలు అసెంబ్లీకి 7 నామినేషన్లు దాఖలు Wed, Apr 24, 2024, 01:17 PM
సత్యప్రసాద్ నామినేషన్ కు ప్రజలు భారీగా తరలి రావాలి Wed, Apr 24, 2024, 01:14 PM
పొగాకు అత్యధిక ధర రూ. 270 Wed, Apr 24, 2024, 01:11 PM