హిందూపురంకు బాలకృష్ణ.... ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి హాజరు

by సూర్య | Wed, Jan 25, 2023, 09:01 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. హిందూపురంలో రేపు టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎటూ తేల్చిచెప్పకపోవడంతో కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. 


కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ముందస్తుగా అనుమతి కోరినా ఇంకా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఇదే విషయమై మాట్లాడుతూ.. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు.


Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM