పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టారు : పవన్ కళ్యణ్

by సూర్య | Wed, Jan 25, 2023, 08:41 PM

ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని, వివక్షకు గురైనప్పుడే ఆ విషయం తెలుస్తుందన్నారు. తనపై కూడా వివక్ష చూపారని అన్నారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణిస్తుండగా ఓ బ్రిటీష్ మహిళ తనకు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పాడు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తొలగించామని చెప్పడం బాధాకరమన్నారు.ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టారు...వైసీపీ రంగులు రూ. 21,500 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. నిధులు పక్కదారి పట్టించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్య బట్టారు.


 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM