మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లు ఖర్చు చేశాం

by సూర్య | Wed, Jan 25, 2023, 04:13 PM

రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని అక్కసు, సంక్షేమ పాలనలను చూసి ఓర్వలేనితనంతో కొన్ని పత్రికలూ  తప్పుడు రాతలు రాస్తున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మూడున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాతే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో కంటే 45 శాతం అధికంగా ఎస్సీలకు ఖర్చు చేశామని చెప్పారు. సమాజంలోని అసమానతలు తొలగించేలా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే సబ్‌ప్లాన్‌పై పవన్‌ మీటింగ్‌ పెడుతున్నాడన్నారు. పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే తాను చెప్తానని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM