సెల్ఫీ మోజులో పాము కాటుకు గురై ఓ యువకుడు మృతి

by సూర్య | Wed, Jan 25, 2023, 02:44 PM

సెల్ఫీ మోజులో పాము కాటుకు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి కందుకూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లూరు మండలం బొద్దకూరుపాడు గ్రామానికి చెందిన మణికంఠ రెడ్డి కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతానికి పాములు ఆడించేవారు రాగ ఆ పామును మెడలో వేసుకొని సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో మణికంఠ రెడ్డి పాముకాటుకు గురైయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM