by సూర్య | Wed, Jan 25, 2023, 02:40 PM
ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠ పాలిత శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 28వ తేదీ శనివారం రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, టిటిడి ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆలూరు వేంకట రమణారావు, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, ఆలయ కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు వెల్లడించారు. ఆదిత్య హోమంతో పాటు శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.
Latest News