by సూర్య | Wed, Jan 25, 2023, 02:35 PM
13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం నాగులుప్పలపాడులో తహసిల్దార్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓటర్ల దినోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ అశోక్ రెడ్డి సూచించారు. అనంతరం ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీనివాసరావు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News