ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:35 PM

13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం నాగులుప్పలపాడులో తహసిల్దార్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓటర్ల దినోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ అశోక్ రెడ్డి సూచించారు. అనంతరం ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీనివాసరావు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM
30న రామనారాయణం దశమ వార్షికోత్సవ వేడుకలు Thu, Mar 28, 2024, 04:00 PM