![]() |
![]() |
by సూర్య | Wed, Jan 25, 2023, 02:31 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ పళ్లెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు నాయకులు పాల్గొని పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీఎం మోడీ చేస్తున్న దేశ అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేలా అందరం వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News