విద్యుత్‌ భారాలపై పట్టించుకోరా...?

by సూర్య | Wed, Jan 25, 2023, 02:23 PM

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ప్రతిపాదించే 2023-24 వార్షిక ఆదాయ, వ్యయ ప్రతిపాదనలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భవిష్యత్తులో ప్రజలపై మోపే విద్యుత్‌ భారాలపై ఎలాంటి చర్చా జరగలేదని ఇంధనరంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయపక్షాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో సునామీలా వచ్చి పడే భారాలైన.. అదానీ కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల ఖర్చు, హిందూజాకు చెల్లింపులు, స్మార్టు మీటర్ల అంశాలపై ఈఆర్‌సీ స్పందనే కరువైందని అసహనం వ్యక్తం చేశాయి. కేవలం డిస్కమ్‌లు ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్‌లకే ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయాన్ని పరిమితం చేయడం విమర్శలకు తావిచ్చింది. వినియోగదారుల నుంచి వాస్తవ వ్యయాల పేరిట వసూలు చేస్తున్న ‘ట్రూఅప్‌’ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, అదనపు లోడు డిపాజిట్‌, ఇంధన పన్నులు వంటి వాటిపై ప్రస్తావనకే వీలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అదేవిధంగా భవిష్యత్‌లో వినియోగదారులపై పడనున్న స్మార్ట్‌ మీటర్ల చార్జీలు, రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉందంటూనే అదానీకి చెందిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి 7000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం, హిందూజాకు బకాయిల పేరిట రూ.2,300 కోట్ల చెల్లింపులు వంటి అంశాలపై ఈఆర్‌సీ ఈ నెల 19 నుంచి 21 దాకా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో చర్చకు అవకాశమే లేకుండా పోయిందని ఆయా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఆర్‌ఆర్‌లపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ నామమాత్రమే అయిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM