by సూర్య | Wed, Jan 25, 2023, 02:12 PM
శీతాకాలం వచ్చిందంటే చాలు.. కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమవుతుంది. పరిసర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఆహ్లాదకరంగా ఉంటాయి. దీంతో కశ్మీర్ కి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కశ్మీర్ లో మంచు కురుస్తుండడంతో గుల్మార్గ్ సమీపంలోని ప్రముఖ డ్రంగ్ వాటర్ ఫాల్ మంచుతో గడ్డకట్టింది. గడ్డకట్టిన వాటర్ ఫాల్ ను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Latest News