ఉగ్రవాదుల ఫొటోలతో పోస్టర్లు అంటించి...భద్రతపై నిఘా పెట్టి,,,రిపబ్లిక్ డే వేళ పోలీసుల అలర్ట్

by సూర్య | Wed, Jan 25, 2023, 01:37 PM

ఉగ్రదాడులు జరగొచ్చు అన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వీధుల్లో హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది ఫోటోలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని మహ్మద్ నగర్‌కు చెందిన మోహద్ ఉమర్(ఉమర్ హైదరాబాదీ) పేరుతో ఢిల్లీ పోలీసులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. మోహద్ ఉమర్ ఆల్‌ఖైదాకి చెందిన ఉగ్రవాదిగా ఉన్నాడు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హైఅలర్ట్ ప్రటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ రాజధానిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.


ఈ క్రమంలో ఉగ్రవాదుల ఫొటోలతో ఢిల్లీలో పోస్టర్లు అతికించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఉమర్‌తో పాటు కర్ణాటక, జార్ఖండ్, యూపీ, ఢిల్లీకి చెందిన చాలామంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల ఫొటోలను అతికించారు. ఆల్ ఖైదా, పాక్ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్ట్‌ల ఫోటోలతో బహిరంగ ప్రదేశాలు, కూడళ్లు, హోటల్స్ వద్ద పోస్టర్లు వెలిశాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.


ఇటీవల ఢిల్లీలో ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు కలకలం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ రాసి ఉన్న పోస్టర్లు సంచలనం రేపాయి. రిపబ్లిక్ వేడుకలు జరుపుకోనున్న క్రమంలో ఈ పోస్టర్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని వికాస్ పురి, పీరాగర్హి, పశ్చిమ విహార్, జనక్‌పురి పాటు 10 ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సిఖ్ పర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థ ఈ కార్యకలాపాలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


రిపబ్లిక్ డే నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు డాగ్, బాంబ్ స్వ్కాడ్‌లను రంగంలోకి దింపి మార్కెట్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే హోటళ్లు, లాడ్జీలలో చెకింగ్‌లు చేస్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని హోటళ్ల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించేందుకు మార్కెట్ వెల్పేర్ అసోసియేషన్లతో భేటీ అయ్యారు. అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఢిల్లీ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లో వాహనాలను చెక్ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Latest News

 
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM