విస్తోపోయే ఘటనలతో... ఆ కేసులో 6,600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:27 PM

విస్తోపోయే ఘటనలతో ఢిల్లీ హత్య కేసులో 6,600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై నేరపూరిత కుట్ర అభియోగం మోపలేదని, ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోయి.. అతడ్ని వదిలించుకోవాలనుకున్నందున శ్రద్ధాను చంపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మొత్తం 6,629 పేజీలు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో కేసుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. శ్రద్ధా, అప్తాబ్‌లకు పరిచయం ఏర్పడిన రోజు మే 17 అని.. గతేడాది అదే రోజు ఇరువురి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. దీనికి ముందు రోజు రాత్రి డేటింగ్ యాప్‌లో పరిచయమైన మరో యువకుడి గదిలో శ్రద్ధా గడపడమే కారణమని వివరించారు.


హత్య కేసులో ఛార్జ్‌షీట్ దాఖలకు మరో రెండు వారాలు గడువు ఉండగానే పోలీసులు మంగళవారం దానిని కోర్టు ముందుంచారు. నిబంధనల ప్రకారం ఓ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసిన మూడు నెలల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలి. దీనికి అనుబంధ ఛార్జ్‌షీట్‌ను వచ్చే నెలలో దాఖలు చేయనున్నారు. ఇక, శ్రద్ధా వాకర్‌ను చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని అఫ్తాబ్ 35 భాగాలుగా నరికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పలుచోట్ల విసిరేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 18 శరీర భాగాలు లభ్యం కాగా.. ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల్లో అవి హతురాలివేనని తేలింది.


డీఎన్ఏ, మైటోకాన్డ్రియల్ పరీక్షలు హత్యకు గురైన మహిళను తప్పిపోయిన శ్రద్ధా అని ధృవీకరించాయి. శ్రద్ధా అదృశ్యం తర్వాత కేసును తప్పుదారి పట్టించడానికి యాప్‌లో ఇద్దరి కోసం భోజనం ఆర్డర్, గూగుల్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతర సాంకేతిక వివరాలు అఫ్తాబ్ క్రిమినల్ మైండ్‌సెట్‌ను బయటపెట్టాయి. శ్రద్ధా కాల్ డేటాలో అఫ్తాబ్ వాయిస్, గతంలో తనను చంపుతానని ముంబై పోలీసులకు ఆమె చేసిన ఫిర్యాదు ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించాయి. అలాగే, శ్రద్ధా స్నేహితుడు, కుటుంబసభ్యులు, సహచరులు, ఇద్దరికీ ఉమ్మడి స్నేహితులు, హత్యకు వాడిని ఆయుధాలు కొనుగోలు చేసిన షాపు యజమాని సహా మొత్తం 182 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలం నమోదుచేశారు.


శ్రద్ధాను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరకడానికి కత్తి సహా పలు ఆయుధాలను నిందితుడు వినియోగించినట్టు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫీ పరీక్షల నివేదికలు కూడా కేసు విచారణకు సహకరించాయి. విచారణలో శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేయడానికి చైనీస్ క్లీవర్‌ను ఉపయోగించినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు. ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ మనస్తత్వాన్ని అంచనా వేయడానికి, ఆలోచనవిధానాన్ని తెలుసుకోడానికి బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షకు అనుమతికోరారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM