by సూర్య | Thu, Nov 24, 2022, 10:17 PM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ చేస్తున్నది దిగజారుడు రాజకీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని రోజా వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ ను కూడా అలాగే వాడుకుంటారని రోజా విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని పవన్ చంద్రబాబు ఉచ్చులో పడకుండా వాస్తవాలు అర్థం చేసుకోవాలని కోరారు.
Latest News