పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

by సూర్య | Thu, Nov 24, 2022, 12:46 PM

నందిగామ పట్టణంలోని 13 , 14 వార్డులలో గడపగడపకు- మన ప్రభుత్వం నిధులు రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు , సిసి రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణంలో గడపగడపకు విజయవంతంగా జరుగుతుందని , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు , ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుందని తెలిపారు , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధికి రూ. 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నారని ఆ నిధులతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు , పట్టణంలోని 13 -14 వార్డుల సచివాలయానికి రూ. 20 లక్షల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని , రెండు వార్డులకు చేరో రూ. 10 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు , పట్టణంలోని పది సచివాలయాలకు గడపగడపకు మన ప్రభుత్వం నిధులు రూ. 2 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం , కౌన్సిల్ సభ్యులు గద్దె శేషు కుమారి , నాదెండ్ల నరేంద్ర , గద్దె రమేష్ , నరసింహారావు, మారం అమరయ్య , షేక్ ఖాలిక్, పాకాలపాటి కిరణ్ , షేక్ జాఫర్ , మన్నెం దాసు , మండవ పిచ్చయ్య , మహమ్మద్ మస్తాన్ , పాములపాటి రమేష్, గుడివాడ సాంబశివరావు, దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి , చల్లా బ్రహ్మం , నల్లమల్లి మురళి, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM