తాడిపత్రిలో ఉద్రిక్తత, పరస్పరం రాళ్ళ దాడులు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:03 AM

తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మిత రెడ్డి లక్ష్యంగా బుధవారం సాయంత్రం రాళ్ల దాడి జరిగింది. తాడిపత్రి పట్టణంలోని మూడో వార్డులో పర్యటిస్తున్న ఆయనపై ప్రణాళిక ప్రకారం దాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. తాడిపత్రి పట్టణంలోని వివిధ వార్డులలో కొంతకాలంగా అశ్మిత రెడ్డి పర్యటించి, ప్రజల సమస్యను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో 3వ వార్డులో బుధవారం సాయంత్రం పర్యటించారు. దీంతో వార్డులో పర్యటించవద్దని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. హాజీ, అడ్డు రఫీ తదితరులతో కలిసి పలువురు వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వారిని ప్రతిఘటించేందుకు టీడీపీ వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఈ గొడవలో టీడీపీ వర్గీయులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వైసీపీ వర్గీయుడు హాజీ తకు గాయమైంది. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM