by సూర్య | Thu, Nov 24, 2022, 10:57 AM
నూజివీడులో గంజాయి విక్రేతను అదుపులోకి తీసుకుని, కేజీ గంజాయిని స్వాధీన పరుచుకున్నట్టు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్గౌడ్ తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూజి వీడు బస్టాండ్ సెంటర్కు చెందిన జగన్నాథం పండును రాజీవ్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్న నూజివీడు సీఐ మూర్తి, ఎస్ఐ వెంకటేష్లు అతని నుంచి కేజీ గంజాయిని స్వాధీనపరుచుకున్నామన్నారు. గతంలో ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని తెలిపారు.
Latest News