by సూర్య | Thu, Nov 24, 2022, 10:54 AM
టీడీపీ జాతీయ అధ్య క్షుడు చంద్రబాబునాయుడును, జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు బుధవారం కలిశారు. త్వరలో లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనలో ఎంపీ పాలుపంచుకున్నారు. చంద్రబాబుతో రాజకీయ విషయాలను చర్చించారు.వైసీపీ ప్రభుత్వ ఆగడాలపై త్వరలో నిర్వహించనున్న ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి అనే కార్యక్రమంపై టీడీపీ నాయకులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ శిక్షణకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు టం కాల మౌళీశ్వరరావు, పైల రామకృష్ణ, బి.అప్పలనాయుడు హాజరయ్యారు.
Latest News