by సూర్య | Thu, Nov 24, 2022, 10:51 AM
పెట్రోల్ పంపు వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో జరిగింది. సిహానిగేట్ ఏరియా పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విచారణ అనంతరం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిహానిగేట్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించినట్లు ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఇరువర్గాల మధ్య గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై కారణాలు తెలియరాలేదు.
Latest News