by సూర్య | Thu, Nov 24, 2022, 10:50 AM
ఏపీ వ్యాప్తంగా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేయగా.. పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 21, 22, 23, 29, జనవరి 2 తేదీల్లో పరీక్ష ఉంటుంది. అలాగే కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 26, మిగతా పోస్టులకు డిసెంబర్ 26-29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అభ్యర్థులు గమనించాలని సూచించారు.
Latest News