ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమైన టీడీపీ నేతలు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:05 PM

రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు టీడీపీ నేతలు సమాయాత్తమవుతున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు ‘ఇదేం ఖర్మ’ పేరిట వినూత్న కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా నేతలు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ‘బాదుడే బాదుడు’ పేరిట చేపడుతున్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇటువంటి తరుణంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజలకు తెలియజేసి, వారిని చైతన్యవంతం చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. మొత్తంగా సర్కారు తీరును ఎండగట్టనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM