by సూర్య | Wed, Oct 05, 2022, 11:06 PM
రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతుతన్నారని.. అదే మూడు ముక్కలాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దుర్భుద్దితో మంత్రి కొట్టు సత్యనారాయణ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఫేక్ పాదయాత్ర.. ఇదంతా చంద్రబాబే చేయిస్తున్నారని రకరకాలుగా ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణకు దమ్ముంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు. జనాన్ని పోగు చేసి రైతుల పాదయాత్ర నిజమో.. ఫేకో తేల్చాలన్నారు. అంత జనాన్ని పోగు చేసే దమ్ము కొట్టు సత్యనారాయణకు ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు.
ఎక్కడ మంత్రి పదవి ఊడుతుందో అన్న భయం.. ముఖ్యమంత్రి మెహర్భానీ కోసం మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలా పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. రైతుల పాదయాత్ర ఫేకో.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడకపోతే మంత్రి పదవి ఊడుతుందని.. సీఎం మెప్పు కోసం ఇలాంటి ఫ్లెక్సీలు కట్టించావా అన్నారు. అసలు రైతుల పాదయాత్ర ఫేక్ అని ఎలా అంటారని మండిపడ్డారు. క్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదన్నారు.
Latest News