డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో

by సూర్య | Wed, Oct 05, 2022, 11:04 PM

ఎలక్ట్రిక్ బైక్ ల విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా.. తాజగా మరికొన్ని బంపరాఫర్‌లు ప్రకటించారు. డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.. అలాగే అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు కూడా వస్తాయన్నారు.


వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి 24–60 నెలల్లో ఈఎంఐ పద్దతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం నెలకు రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వోద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో నెడ్‌కాప్‌ ఒప్పందం చేసుకున్నాయి. వడ్డీరేటు 9 శాతం కాగా.. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఆ సంస్థ సీఈవో, మేనేజర్‌ కానీ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ సూచించింది.


అలాగే ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. సిబ్బంది కోరితే ఈ–వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించాలని సూచించింది. అంతేకాదు ఈవీల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉండగా.. హైవేలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రైవేట్‌ స్థలాలు వంటి చోట్ల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాలను గుర్తించారు అధికారులు. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్‌ అయ్యే స్టేషన్లని అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రోత్సాహించడం ద్వారా వాతావరణంలో కాలుష్యం తగ్గించొచ్చిన భావిస్తున్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM