రైలెక్కిన మాజీ ఉప రాష్ట్రపతి...చెన్నైకు వెంకయ్యనాయుడు

by సూర్య | Wed, Oct 05, 2022, 07:16 PM

ఎంతటి వారికైనా రైలు ప్రయాణం ఓ సరదా. కార్లు..విమానాలు ఎక్కినా అపుడపుడు రైలెక్కాలనిపిస్తుంది. ఇదిలావుంటే భార‌త మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బుధ‌వారం రైలులో ప్రయాణించారు. గ‌డ‌చిన రెండు రోజులుగా త‌న సొంత జిల్లా నెల్లూరు వ‌చ్చిన వెంక‌య్య‌... ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో బిజీబిజీగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఏర్పాటు చేసిన స‌న్మాన స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకున్న వెంక‌య్య చెన్నై బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైలు ప్ర‌యాణాన్ని ఆశ్ర‌యించారు. నెల్లూరు జిల్లాలోని గూడురు రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న వెంక‌య్య‌కు అక్క‌డి స్థానికులు వీడ్కోలు చెప్ప‌గా... రైల్వే స్టేష‌న్‌లో ఆయ‌న కొద్దిసేపు రైలు కోసం వేచి చూశారు. ధ‌నాపూర్‌-బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్ రైలు రాగానే...అందులోకి ఎక్కిన వెంక‌య్య చెన్నై బ‌య‌లుదేరి వెళ్లిపోయారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM