by సూర్య | Tue, Oct 04, 2022, 09:46 PM
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. రవాణా, సంస్కృతి, పర్యాటక శాఖల పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకడ్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కమిటీకి చైర్మన్గా నియమించిన ధంకడ్తో పాటు తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Latest News