by సూర్య | Tue, Oct 04, 2022, 05:23 PM
జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకునేలా అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితా తయారీపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
Latest News