by సూర్య | Tue, Oct 04, 2022, 05:18 PM
కడప జిల్లా సిద్ధవటం మండలంలోని పెద్దపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొనడంతో అక్కడిక్కడే ఒక వ్యక్తి మృతి చెందారు. మృతుడు పెద్దపల్లి హరిజన వాడ కు చెందిన నరసయ్య గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయలూ కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News