by సూర్య | Tue, Oct 04, 2022, 05:03 PM
శ్రీకాకుళం జిల్లాఆమదాలవలస నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో 18 వ వార్డు పరిధిలో బొడ్డేపల్లి పేట లో మంగళవారం గడప గడపకు కార్యక్రమం కొనసాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాంకు చిరుజల్లులు స్వాగతం పలికాయి. క్రమంగా కార్యక్రమం ఆసాంతం చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ గ్రామంలో ప్రతి గడపకు, , చేరుకొని ఉల్లాసంగా. ఉత్సాహంగా పలకరిస్తూ కార్యక్రమాన్ని స్పీకర్ కొనసాగించారు. వర్షం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు సూచించినా. కార్యక్రమాన్ని కొనసాగించేందుకే స్పీకర్ మొగ్గుచూపారు. నవరత్నాల పథకాలు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నరని ప్రతి మహిళ కళ్ల లో ఆనందం వెల్లివిరుస్తుందని శాసన సభాపతి అన్నారు.
Latest News