by సూర్య | Tue, Oct 04, 2022, 11:51 AM
వీరపనాయనిపల్లి మండల పరిధిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో అధికారులు ఏర్పాటు చేసిన మూడవ విడత వైయస్సార్ చేయూత ఉత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. వీరపనాయనిపల్లి మండలం 45 నుండి 60 వయసు గల ఎస్సీ, ఎస్టీ, బిసి, అల్పసంఖ్యాక వర్గాల 1362 మంది అక్క చెల్లమ్మలకు రూ. రెండు కోట్ల యాబై ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల లబ్ది పొందారు. మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేయూతకు ఎంపికయిన అక్కాచెల్లమ్మలు పాల్గొన్నారు.
Latest News