by సూర్య | Tue, Oct 04, 2022, 11:50 AM
కడప జిల్లా సిద్ధవటం పెన్నా లో లెవెల్ కాజ్వే పై ఉన్న త్రాగునీటి పైపులైను వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. 2014లో 1. 50 కోట్లతో పెన్నా నుంచి సిద్ధపటం ప్రజలకు త్రాగునీటి పథకాన్ని నిర్మించారు. వరద నీటి ఉధృతికి పైపులైను తరచూ కొట్టుకుపోతుంది. మూడు రోజుల కిందట పైపులైను మళ్ళీ కొట్టుకుపోవడంతో సిద్ధవటం ప్రజలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. శాశ్వతంగా నిలబడేలా పైపులైను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Latest News