by సూర్య | Tue, Oct 04, 2022, 11:49 AM
అన్నమయ్య జిల్లా మందపల్లి గ్రామంలో వరదల వలన కొట్టుకుపోయిన ముస్లిం స్మశాన వాటిక స్థలాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాథరెడ్డి సోమవారం పరిశీలించారు. వరదల వలన ప్రహరీ గోడ కొట్టుకుపోయిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించారు. జిల్లా పరిషత్ నిధులతో ప్రహరీ గోడను నిర్మిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. దీంతో ముస్లిం సోదరులు హర్షణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సర్పంచ్ శ్రీహరి, నరసయ్య, హరిబాబు, ముస్లిం సోదరులు, బిళ్ళ నరేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Latest News