by సూర్య | Tue, Oct 04, 2022, 11:48 AM
పొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని స్థానిక 8 వ వార్డులో కౌన్సిలర్ రాగుల శాంతి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొని వార్డులో గల ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ వార్డులో పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్ది, వైసీపీ పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి ప్రతాప్ రెడ్డి, వైసిపి మహిళ నాయకురాల్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Latest News