by సూర్య | Tue, Oct 04, 2022, 11:47 AM
భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈదర గ్రామానికి చెందిన షేక్ అల్లమ్మ(30) భర్త శ్రీను మద్యం తాగి రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. భరించలేనిఅల్లమ్మ పుట్టింటికి వచ్చి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుందని తెలిపారు. మంగళవారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News