by సూర్య | Tue, Oct 04, 2022, 11:46 AM
ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్రెడ్డి మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేశారని ఉపముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ అన్నారు. సోమవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ షేక్ షంషేర్ బాషా ఆధ్వర్యంలో నకాష్ 2వ సచివాలయం పరిధిలోని నకాష్, కేజర్ మసీదు వీధి, గోపాల్ స్వామి గుడి వీధి, మకాం గడ్డ వీధి పలు ప్రాంతాలలో గడపగడపకూ వైసిపి కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. కార్పొరేటర్లు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News