కడప పర్యాటకానికి రాష్ట్ర అవార్డు

by సూర్య | Tue, Oct 04, 2022, 11:45 AM

వైఎస్‌ఆర్‌ కేంద్రంగా పనిచేస్తున్న రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీకి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పర్యాటక సంస్థ అవార్డు దక్కడం జిల్లాలోని పర్యాటక రంగానికి గౌరవం దక్కినట్లు అయిందని ఎంఎం ఆస్పత్రి ఎమ్‌డి డాక్టర్‌ ఎస్‌. మహబూబ్‌పీరా పేర్కొన్నారు. సోమవారం మానస ఇన్‌లో లయన్స్‌ క్లబ్‌, పోతుల చిన్న ఓబుల్‌ రెడ్డి, కంచమ్మ, సరస్వతమ్మ స్మారక ట్రస్ట్‌లతో కలసి 'కడప పర్యాటకానికి పట్టాభిషేకం' అంశంపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ మహబూబ్‌ పీర్‌ మాట్లాడుతూ జిల్లాకు అవార్డు దక్కడం వెనుక సభ్యులందరి కృషి ఉందని చెప్పారు. అనంతరం అవార్డు గ్రహీత జనార్ధనరాజును సంస్థ సభ్యులు సన్నిహితులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్‌ పద్మప్రియ చంద్రారెడ్డి, సంస్థ కోశాధికారి బాలగొండ గంగాధర్‌, పర్యాటకాభిమానులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM