by సూర్య | Tue, Oct 04, 2022, 10:45 AM
ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో భక్తి శ్రద్ధలతో భక్తులు శ్రీ రామభక్త ఆంజనేయ ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. మంగళ వారం శ్రీరామభక్తాంజనేయ విగ్రహాలకు భక్తులు పూజలు నిర్వహించారు. ఆమదాల వలస పట్టణ పరిధిలోగల ఊసావానిపేట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రామభక్త ఆంజనేయ ఆలయంలో పూజలు భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, శ్రీనివాస్ శర్మ, ప్రసాద్ శర్మ, శ్రీ రామభక్త ఆంజనేయ ఉత్సవ విగ్రహాలకు తమలపాకార్చన, సింధూరార్చన నిర్వహించారు. ఈ పూజలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీదేవి ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామికి, వెంకటేశ్వర ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్ముడుపేటలో ఉన్న భక్తాంజ నేయస్వామికి పూజలు నిర్వహించారు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న శ్రీ రామభక్త ఆంజనేయ మందిరాలలో భక్తులు పూజలు, భజనలు నిర్వహించారు.
Latest News