నోటీసులు ఇస్తే ఉలికిపాటు ఎందుకు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు

by సూర్య | Mon, Oct 03, 2022, 07:21 PM

ఏపీ సీఐడీ నోటీసులు ఇస్తే ఉలికిపాటు ఎందుకని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు.  ఏపీ సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతిపై దుష్ప్రచారం ఐటీడీపీ పనే అని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఈ వ్యవహారంలో అయ్యన్న మాటలు ఆయన సీనియారిటీకి తగినవి కావని అన్నారు. రాజకీయంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే మందలించాల్సింది పోయి, అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నీ వయసెంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? అని ప్రశ్నించారు. అయ్యన్న తీరు సైకోలా ఉందన్నారు.


"నోటీసులు వచ్చిన తర్వాత మీ కుమారుడికి మీరు ఫోన్ చేసి విచారణకు హాజరవమని చెప్పాలి. మీ వల్ల తప్పేమీ లేదనుకుంటే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? మీ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకురమ్మన్నారు... మీరు ఎలాంటి తప్పు చేయలేదనుకుంటే వాటిని తీసుకెళ్లి అక్కడ పెట్టండి. మీరే కాదు, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం విచారణకు హాజరయ్యారు" అని ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవల అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై అయ్యన్న తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పైవిధంగా స్పందించారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM