by సూర్య | Fri, Sep 23, 2022, 07:38 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని ఓ ఏటీఎం మాదిరి మార్చుకుని దోచుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశాడని, అధికారం పోయిన తర్వాత అమరావతి ఉద్యమం పేరుతో అమరావతి నుండి అమెరికా వరకు దోచుకుంటున్నారని విమర్శించారు.