by సూర్య | Fri, Sep 23, 2022, 07:09 PM
ఏపీ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గురువారం కనకదుర్గమ్మ సేవలో తరించారు. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను అధికారులు ఇతర మంత్రులతో కలసి ఆమె పరిశీలించారు. అనంతరం దుర్గమ్మ సేవలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ అధికారులు వేద పండితులు ఆహ్వానం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు.
Latest News