by సూర్య | Fri, Sep 23, 2022, 04:46 PM
కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈరోజు కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చారు. కారు డ్రైవర్ హత్య కేసులో నేటితో రిమాండ్ గడువు ముగిసింది. మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్లో ఉన్నారు. హైకోర్టులో అనంతబాబు రెగ్యులర్ బెయిల్పై ఈనెల 26న విచారణ జరుగనుంది.
Latest News