by సూర్య | Fri, Sep 23, 2022, 04:32 PM
ఉండి నియోజకవర్గం ఆకివీడులో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నందమూరి తారకరామారావు గారిని,తెలుగుజాతిని కించపరిచేలా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారుస్తూ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ ఆకివీడు డైలీ మార్కెట్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ గారి పేరునే కొనసాగించాలని టీడీపీ నాయకులూ మంతెన రామరాజు డిమాండ్ చేసారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నియోజకవర్గ నాయకులు తో కలిసి జీవో ప్రతులను తగలబెట్టడం జరిగినది.
Latest News